సునీత జోష్.. హోరెత్తిన నుమాయిష్

సునీత జోష్.. హోరెత్తిన నుమాయిష్

 వెలుగు, బషీర్ బాగ్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో కొనసాగుతున్న నుమాయిష్​లో ఫేమస్​సింగర్​సునీత సందడి చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన మ్యూజికల్ నైట్​లో తన పాటలతో అలరించారు. ఉర్రూతలూగించే ఆమె పాటలకు యువత కోరస్ ఇస్తూ ఎగ్జిబిషన్​గ్రౌండ్​ను హోరెత్తించారు. అనంతరం సునీతను సొసైటీ సభ్యులు సన్మానించారు.